జర్నలిస్టులను ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తించాలన్నారు తెలంగాణా శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి…ఈ మేరకు జర్నలిస్టుల సమస్యలు, ప్రధానంగా కరోనా బారినపడుతూ కష్టాలు పడుతున్న జర్నలిస్టుల విషయాలపై TUWJ (IJU) డిప్యూటీ జనరల్ సెక్రెటరీ విష్ణుదాస్ శ్రీకాంత్ సమస్యలను వివరించారు…
స్పీకర్ ఇంట్లో కాసేపు జర్నలిస్టుల సమస్యలపై మాట్లాడిన శ్రీనివాసరెడ్డి జర్నలిస్టులను ఖచ్చితంగా ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తించాల్సిందేనన్నారు….యూనియన్ తరపున విజ్ణప్తికి స్పందించిన శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి
జర్నలిస్టులను కూడా ఫ్రంట్ లైన్ వారియర్స్ లిస్టులో చేర్చడమేగాకుండా ఫ్రంట్ లైన్ వారియర్స్ గా ఉన్నవారికి ఎలాంటి సౌకర్యాలున్నాయో అవి కల్పించాలన్నారు…
కరోనా విజ్రుంభిస్తున్న నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని..విధి నిర్వహణలో తప్పని పరిస్థితుల్లో పనిచేస్తున్న జర్నలిస్టులకు ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు వచ్చినా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు..ఇలాంటి విషయాల్లో ప్రభుత్వం వెంటనే స్పందించి వారికి అండగా ఉండాలన్నారు.