36.2 C
Hyderabad
April 25, 2024 20: 33 PM
Slider వరంగల్

కలం కార్మికులు కరోనా పట్ల జాగ్రత్తగా ఉండాలి

#journalist

కలం కార్మికులు కరోనా పట్ల జాగ్రత్తగా ఉండాలని టీడబ్ల్యూజే (ఐజేయూ) మొగుళ్లపల్లి మండల ఉపాధ్యక్షుడు వేముల మహేందర్ గౌడ్ కోరారు. శనివారం రోజున ఆయన విలేకర్లతో మాట్లాడుతూ కరోనా కబళిస్తున్న వారిలో ఎక్కువ మంది జర్నలిస్టులే  ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వృత్తి రీత్యా న్యూస్ సేకరణకు బయటకు వెళ్లడం జర్నలిస్టులకు అనివార్యం అవుతుందని, జాగ్రత్తలు పాటిస్తూ ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలని సూచించారు. కరోనా పాజిటివ్ వస్తే అదైర్య పడకుండా దైర్యంగా ఉండాలని అన్నారు. కరోనాతో మృతి చెందిన వర్కింగ్ జర్నలిస్టుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. జర్నలిస్టులు కరోనాతో హోమ్ క్వారంటైన్ లో ఉన్నప్పుడు ప్రభుత్వం 20 వేలు కేటాయించిన అమలులో మాత్రం 10 వేలు మాత్రమే ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హోమ్ క్వారంటైన్ లో ఉన్న జర్నలిస్టులకు 50 వేలు,  కరోనాతో మృతి చెందిన జర్నలిస్టులకు 50 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. వర్కింగ్ జర్నలిస్టులకు ఏ ఆపద వచ్చినా, ఏ సమస్య వచ్చినా టీడబ్ల్యూజే (ఐజేయూ) ముందుంటుందని అన్నారు.

Related posts

కేంద్రం ఇవ్వకున్నా ఆగకుండా సంక్షేమం

Satyam NEWS

లాక్ డౌన్ ఖాళీతో ఎల్బీనగర్ ఎడమ ఫ్లైఓవర్ నిర్మాణం

Satyam NEWS

గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం పంపిణీ

Satyam NEWS

Leave a Comment