37.2 C
Hyderabad
March 29, 2024 20: 44 PM
Slider విజయనగరం

జర్నలిస్టుల సంక్షేమానికై కలెక్టరేట్ వద్ద నిరసన

#Journalists Protest

విజయనగరం జిల్లా కేంద్రంలో జర్నలిస్టులంతా సంఘాలన్నీ పక్కన పెట్టి..ఏకతాటిపై వచ్చి జర్నలిస్టు సంక్షేమంపై ప్రభుత్వ వైఖరికి నిరసన తెలియజేశారు.

ఏపీయూడబ్యుజే ,ఏపీడబ్ల్యూఎఫ్ సంయుక్తంగా కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపారు. జర్నలిస్టులందరికీ అక్రిడేషన్ లు మంజూరు చెయ్యాలని జర్నలిస్టుల కుటుంబాలను అదుకోవాలని పేర్కొంటూ ధర్నా చేసారు.

కలెక్టరేట్ లోని క్యాంటీన్ వద్ద నుంచీ ర్యాలీ గి బయలుదేరి…రెండో గేట్ వద్ద ఆందోళన నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ లో జరుగుతున్న గ్రీవిన్స్ నిర్వహిస్తున్న కలెక్టర్ ను కలిసి వినతి పత్రాన్ని ఇచ్చారు.

ఈ సందర్భంగా ఏపీయూడబ్యుజే రాష్ట్ర నేత పీఎస్ఎస్ వి ప్రసాద్ మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం జర్నలిస్టులను పట్టించుకోవటం లేదని అన్నారు. అనంతరం ప్రజాశక్తి స్టాఫ్ రిపోర్టర్ రమేష్ నాయుడు కూడా మాట్లాడారు.

Related posts

పవన్ కల్యాణ్ సీఎం కావాలని మోకాళ్లపై ఆదోని కొండ ఎక్కిన మహిళ…

Bhavani

నర్సంపేటలో టిఆర్ ఎస్ నాయకుడిపై కత్తులతో దాడి

Satyam NEWS

అశ్వ‌వాహ‌నంపై శ్రీకోదండరామస్వామి ద‌ర్శ‌నం

Satyam NEWS

Leave a Comment