సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి జర్నలిస్టు సంతోష్ నాయక్ పై అసభ్య పదజాలంతో దూషించడాన్ని నిరసిస్తూ సోమవారం వికారాబాద్ జిల్లా తాండూరు, కొడంగల్ ప్రాంతంలో జర్నలిస్టులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా తాండూరు ఆర్డీవో కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ శృతికి, కొడంగల్ తహసీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు.
సీనియర్ జర్నలిస్ట్ రవిశంకర్ మాట్లాడుతూ.. ప్రాణాలకు తెగించి సమాజంలో జరుగుతున్నఅవినీతి, అక్రమాలను వెలికితీసి ప్రజలకు చేరవేసే పవిత్ర వృత్తిలో విలేకరులున్నారన్నారు. అటువంటి విలేకరులను ప్రజాప్రతినిధులు భయభ్రాంతులకు గురి చేయడం తగదని హెచ్చరించారు.
జర్నలిస్ట్ ఫయీమ్ ఖాన్ మాట్లాడుతూ.. ఫోన్లో చంపేస్తానని ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో? అని తూలనాడటం సరికాదని, వెంటనే ఎమ్మెల్యే మహిపాల్రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు లింగేష్, రమేష్, నర్సిములు, అలీమ్, మనోహర్, ముక్తార్, మునిర్, బాలరాజు, గోపాల్, నరేష్, బసయ్య, రాజు, వెంకట్, సుధాకర్ తదితర జర్నలిస్టులు పాల్గొన్నారు.