అన్నమయ్య జిల్లా రాజంపేట లోని ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులకు న్యాయం చేస్తామని ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి అన్నారు. మంగళవారం శ్రీ అన్నమయ్య ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు జంబు సూర్యనారాయణ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే మేడ మల్లికార్జున్ రెడ్డి చేతుల మీదుగా ఆర్డీఓ కోదండరామి రెడ్డి కి వినతిపత్రం అందజేయడం జరిగింది.
చాలా కాలంగా రాజంపేటలో విలేకరులకు ఇంటి స్థలాలు మంజూరు చేయడం లో ఆలస్యమైందని వీలైనంత తొందరగా రాజంపేట జర్నలిస్టులకు ఇంటి స్థలాలు మంజూరు చేసి జర్నలిస్ట్ కాలనీ ఏర్పాటుకు త్వరలో శ్రీకారం చుట్టామని ఎమ్మెల్యే మేడ మల్లికార్జున్ రెడ్డి హామీ ఇచ్చారు. కొద్దిరోజుల్లో అనువైన ప్రాంతంలో జర్నలిస్టులందరికీశ్రీ అన్నమయ్య జర్నలిస్ట్ కాలనీ ఏర్పాటుకు అందమైన ప్రాంతాల్లో స్థలాలు గుర్తించి వారి కీ కేటాయించాలని ఆర్డీవో కోదండరామి రెడ్డి కి సూచించారు. అందరు విలేఖర్లకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
ప్రెస్ క్లబ్ అదనపు భవనాలకు నిధులు
రాజంపేటలో నిర్మాణంలో ఉన్నశ్రీ అన్నమయ్య ప్రెస్ క్లబ్ భవనానికి అదనపు నిధులు కేటాయించాలని ఎమ్మెల్యే మేడ మల్లికార్జున్ రెడ్డిని అలాగే గతంలో ఎంపీ మిథున్ రెడ్డి ని కోరడం జరిగింది. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే మేడ మల్లికార్జున రెడ్డి 15లక్షల రూపాయల నిధులు మంజూరు చేస్తామని తెలిపారు. ఎందుకు సంబంధించి ఎస్టిమేషన్ లు తయారు చేసి సంబంధిత శాఖకు ప్రతిపాదనలు పంపారు.
అలాగే ఈ విషయంపై ఎంపీ మిథున్ రెడ్డి తో మాట్లాడతానని ఎమ్మెల్యే మేడ మల్లికార్జున్ రెడ్డి ప్రెస్ క్లబ్ ప్రతినిధులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జంబు సూర్యనారాయణ, ద్వారకా గోపీనాథ్, పాబోలు ప్రకాష్, దార్ల శ్రీనివాసులు ఆచారి, జి.వి.ఆర్.కె. రాయులు, సానిపాయ జయరాజ్,కూరాకు శ్రీనివాసులు,రవికుమార్, ఓబులేసు, షేక్ ఆలీ షేర్, సాయి, శివయ్య, నరేష్, రాజా తదితరులు పాల్గొన్నారు.