39.2 C
Hyderabad
April 25, 2024 16: 56 PM
Slider కడప

కరోనా నిర్మూలనలో జర్నలిస్టుల పాత్ర అభినందనీయం

#Kadapa Police

కరోనా విపత్తు సమయంలో ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ కరోనా మహమ్మరి పట్ల ప్రజలను చైతన్యపర్చడంలో జర్నలిస్టులది కీలక పాత్ర అని రాయచోటి డిఎస్పీ వాసుదేవన్ పేర్కొన్నారు.

కడప జిల్లా ఎస్పీ కేకే అన్బూరాజన్ అదేశాల మేరకు రాయచోటిలో పని చేస్తున్న జర్నలిస్టులకు  బుధవారం డిఎస్పీ వాసుదేవన్ ఆధ్వర్యంలో పట్టణ సిఐ జి రాజు,రూరల్ సిఐ లింగప్ప,లక్కిరెడ్డిపల్లి సిఐ యుగంధర్ ,పట్టణ యస్ ఐ నరసింహారెడ్డి ట్రైనింగ్ యస్ ఐ చిరంజీవి ల చేతుల మీదగా మెడికల్ కిట్లు అందజేయడం జరిగింది.

ఈ సందర్బంగా డిఎస్పీ వాసుదేవన్ మాట్లాడుతూ కరోనా లాంటి విపత్కర పరిస్థితులలో కూడా వార్తలు సేకరించడం చాలా అభినందనీయం అన్నారు.

ప్రతి జర్నలిస్టు కూడా కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్బంగా సూచించారు.

Related posts

గన్నవరం చేరుకున్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

Satyam NEWS

అమరావతి రైతులకు అండగా ఉండేందుకు జస్టిస్ రాకేష్ కుమార్ సిద్ధం

Satyam NEWS

ఆర్జీవీతో కలిసి “మా ఇష్టం” అంటున్న టిఆరెస్

Satyam NEWS

Leave a Comment