భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ట్విటర్ ఖాతాను ఆదివారం నాడు ఎవరో హ్యాక్ చేశారు. ఉక్రెయిన్పై రష్యా దాడుల నేపథ్యంలో నడ్డా ట్విటర్ ఖాతా ను ఎవరో హ్యాక్ చేసి తప్పుడు మెసేజి పెట్టారు. రష్యా ప్రజలకు మద్దతుగా నిలవాలని, క్రిప్టోకరెన్సీ డొనేషన్స్ ఇవ్వాలని కోరుతూ హ్యాకర్లు ఆయన ఖాతాలో ట్వీట్ను పెట్టారు. అయితే కొద్ది నిమిషాల్లోనే ఆ ట్వీట్ను తొలగించారు. ‘రష్యా ప్రజలకు మద్దతుగా నిలుద్దాం. ఇప్పుడు క్రిప్టోకరెన్సీ డొనేషన్స్, బిట్కాయిన్, ఎథిరియమ్ విరాళాలను స్వీకరిస్తున్నాం’’ అని ఈ ట్వీట్ పేర్కొంది. ఈ మాటలను ఇంగ్లిష్లో రాశారు. అయితే హిందీలో మాత్రం, ‘‘ఉక్రెయిన్ ప్రజలకు మద్దతుగా నిలుద్దాం. ఇప్పుడు క్రిప్టోకరెన్సీ విరాళాలను స్వీకరిస్తున్నాం’’ అని రాశారు.