స్మశాన వాటిక కారణంగా పరిసరాలలోని కుటుంబాల వారు ఇబ్బంది పడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు హైదరాబాద్ జూబ్లిహిల్స్ శాసనసభ్యుడు మాగంటి గోపీనాథ్ అన్నారు.
జూబ్లిహిల్స్ నియోజకవర్గం ఎర్రగడ్డ లోని పాండురంగ నాగర్ లో ఉన్న స్మశాన వాటిక ను నేడు మాగంటి గోపీనాథ్ కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా అక్కడ పరిసరాలలో నివాసం ఉంటున్నవారితో మాట్లాడుతూ కోటి రూపాయలు ఖర్చు చేసి అయినా సరే స్మశానం నుంచి వాసన రాకుండా మెషిన్ ను ఏర్పాటు చేస్తామన్నారు.
ఇదే కాకుండా సమస్యలు ఏమి ఉన్నా త్వరలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో టౌన్ ప్లానింగ్ ఏ సీ పి వేణు, రెవ్యెన్యూ ఇన్ స్పెక్టర్ దివ్య మంజుల, కార్పొరేటర్ శ్రావణ్ కుమార్, మాజీ కార్పొరేటర్ సత్యనారాయణ, స్మశాన వాటిక ప్రెసిడెంట్ సంజీవ,
వార్డ్ మెంబర్ రాము, గంట మల్లేష్, బైరములు, సీ నర్సింగ్ రావు, బాలు, విఠల్ బస్తీ నాయకులు పాల్గొన్నారు.