27.7 C
Hyderabad
April 26, 2024 05: 20 AM
Slider హైదరాబాద్

జీవో 58 పై అవగాహన కోసం ఎమ్మెల్యే మాగంటి పాదయాత్ర

#MLAMagantiGopinath

పేద ప్రజల కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం ఎల్ ఆర్ ఎస్ స్కీం లో కల్పించిన వెసులుబాటును అర్హులైన వారు వినియోగించుకోవాలని హైదరాబాద్ జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కోరారు.

ఇందుకోసం విడుదల చేసిన జీవో 58 పై పేద ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఆయన నేడు పాదయాత్ర నిర్వహించారు.

వెంగళరావు నగర్ డివిజన్ లోని జవహర్ నగర్ లో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పాదయాత్ర చేస్తూ జీవో 58పై ప్రజలకు అవగాహన కల్పించారు.

ఎల్ ఆర్ ఎస్ స్కీం కింద 125 చదరపు గజాల కన్నా తక్కువ ఉన్న వారికి ఎలాంటి రుసుము లేకుండా రిజిస్ట్రేషన్ చేస్తారని ఆయన తెలిపారు.

పేద, మధ్య తరగతి ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో వెంగళరావు నగర్ డివిజన్ టీఆర్ ఎస్ అధ్యక్షుడు దేదీప్యారావు,

వేణుగోపాల్ యాదవ్, జిటిఎస్ టెంపుల్ చైర్మన్ రామ్ చందర్, టీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Related posts

నిజామాబాద్ ఐటీ హబ్ కు హిటాచి గ్రూపు సబ్సిడరీ సంస్థ

Bhavani

హైదరాబాద్ పరిసరాల్లో 50 వేల మందికి కరోనా టెస్టు

Satyam NEWS

కాఫ్టర్ క్రాష్ : హెలికాప్టర్ కూలి ఇద్దరు మిలటరీ పైలట్ల మృతి

Satyam NEWS

Leave a Comment