కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గ కేంద్రంలోని మండల కేంద్రంలో వంద డబుల్ బెడ్ రూం పనులతోపాటు కంపోస్ట్ షెడ్డు పలు అభివృద్ధి పనులను జుక్కల్ శాసనసభ్యులు హనుమంత్ షిండే, జహీరాబాద్ పార్లమెంటు సభ్యులు బీబీ పాటిల్ శనివారం ప్రారంభించారు.
ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ 5కోట్ల 4లక్షల నిధులతో నిర్మించే 100డబుల్ బెడ్రూమ్ లతో పాటు పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా పలు కార్యక్రమాలను ప్రారంభించామన్నారు.
జుక్కల్ నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయంగా తాము కృషి చేస్తున్నామని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఎంపీతో పాటు ఎంపీపీ యశోదా నీలుపటేల్, జెడ్పీటీసీ లక్ష్మీబాయి దాదారావు పాటిల్’తెరాస మండల అధ్యక్షుల బొల్లి గంగాధర్,ఆయా గ్రామాల సర్పంచ్లు ఎంపీటీసీలు ప్రజాప్రతినిధులు తెరాస శ్రేణులు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.