టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు అభిమానులకు శుభవార్త. ఆయనకు కరోనా నెగెటీవ్ వచ్చింది. గత నెలలో ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయనకు అనుమానంతో కరోనా పరీక్ష చేయించుకున్నారు.
దాంతో జూపల్లి కృష్ణారావుకు కరోనా పాజిటీవ్ రిపోర్ట్ వచ్చింది. అప్పటి నుండి ఆయన హోమ్ ఐసోలేషన్ లో ఉన్నారు. వైద్యుల సలహా మేరకు ట్రిట్ మెంట్ తీసుకున్నారు.
అనంతరం ఆయన మళ్లీ కరోనా టెస్టు చేయించుకోగా కరోనా నెగిటివ్ రిపోర్ట్ వచ్చింది. నియోజకవర్గ ప్రజల ఆశీస్సులే తనను తొందరగా కొలుకునే విధంగా చేసిందని జూపల్లి కృష్ణారావు ఈ సందర్భంగా అన్నారు. ప్రతి ఒక్కరికి ఆయన ధన్యవాదాలు తెలిపారు.
కరోనా కు తగు జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని, ఆందోళన పడవల్సిన అవసరం లేదని, అయినా తగు జాగ్రత్తలతో ప్రజలు మెలగాలని జూపల్లి సూచించారు.