జమ్మూ కాశ్మీర్ లెఫ్టెనెంట్ గవర్నర్ గిరిష్ చంద్ర ముర్మూ తన పదవికి రాజీనామా చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. జమ్మూ కాశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతంగా ఏర్పాటు అయిన తర్వాత ముర్మూ ను గత ఏడాది అక్టోబర్ లో లెఫ్టెనెంట్ గవర్నర్ గా నియమించారు.
1985 బ్యాచ్ కి చెందిన ఐఏఎస్ అధికారి అయిన ముర్మూ త్వరలో కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ గా నియమితులు కాబోతున్నట్లు తెలిసింది. అందుకోసమే లెఫ్టెనెంట్ గవర్నర్ పదవికి ఆయన రాజీనామా చేసినట్లు తెలిసింది కానీ ఇంకా అధికారికంగా ధృవీకరణ కాలేదు.