అదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియం లో జిల్లా కబడ్డీ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన జిల్లా స్థాయి జూనియర్ కబడ్డీ జట్ల ఎంపిక కార్యక్రమాన్ని అదిలాబాద్ జిల్లా కబడ్డీ సంఘం చైర్మన్ పార్లమెంటు సభ్యుడు సోయం బాపురావు కబడ్డీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అదిలాబాద్ జిల్లా అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. ఇటీవలే కేంద్ర క్రీడా శాఖ మంత్రిని కలిసి అదిలాబాద్ జిల్లాలో మినీ స్టేడి యాల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరామన్నారు. క్రీడాకారులు ప్రతిరోజూ సాధన చేస్తూ నేర్చుకొని రాష్ట్ర జాతీయ స్థాయిలో రాణించాలి అన్నారు.
సచిన్ టెండూల్కర్ అంతర్జాతీయ స్థాయి క్రికెట్ పోటీలు రెగ్యులర్గా సాధన చేసే వాడిని ఆయన్ని ఆదర్శంగా తీసుకొని కబడ్డీ క్రీడాకారులు ప్రతి రోజు తప్పనిసరిగా ప్రాక్టీస్ చేస్తూ ముందుకు సాగాలన్నారు. క్రీడలతో పాటు చదువుపై కూడా క్రీడాకారులు దృష్టిసారించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో. ప్రధాన కార్యదర్శి రాష్ట్ర పాల్ జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు గోవర్ధన్ రెడ్డి జిల్లా గిరిజన క్రీడల అధికారి పార్థసారథి కబడ్డీ సంఘం ప్రతినిధులు లోక ప్రవీణ్ రెడ్డి, ఇ సాయికుమార్ విట్టల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.