జూనియర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన బిగ్ బాస్ సీజన్ 1 ను మళ్లీ టెలికాస్టు చేయాలని మా టీవీ నిర్ణయించింది. ప్రస్తుతం కరోనా కారణంగా షూటింగులు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. కొత్త కార్యక్రమాలు లేకపోవడంతో పాత కార్యక్రమాలనే పున: ప్రసారాలు చేస్తున్నారు.
ఇందులో భాగంగానే బిగ్ బాస్ 1 ను రీ టెలీకాస్టు చేయబోతున్నారు. ఈ వార్త తెలిసి జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎంతో సంతోష పడుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ను తెరపై చూసి చాలాకాలం అయింది. బుల్లి తెరపై మళ్లీ చూసుకుని సంతోషపడతామని వారు అనుకుంటున్నారు. బిగ్ బాస్ రియాలిటీ షోలో తొలి సీజన్ కు ఎన్టీఆర్, రెండో సీజన్ కు నేచురల్ స్టార్ నాని, మూడో సీజన్ కు అక్కినేని నాగార్జున హోస్టుగా వ్యవహరించిన విషయం తెలిసిందే.