హీరో ఎన్టీఆర్ కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విటర్ వేదికగా అభిమానులతో పంచుకున్నారు.
‘‘తాజాగా చేసిన పరీక్షల్లో నాకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. నేను బాగానే ఉన్నాను. నేను, నా కుటుంబం ప్రస్తుతం హోం ఐసోలేషన్లో ఉంటూ వైద్యుల సూచనల మేరకు చికిత్స తీసుకుంటున్నాం.
ఇటీవల నన్ను కలిసిన వారందరు కూడా కరోనా పరీక్షలు చేయించుకోవాల్సిందిగా కోరుతున్నా’’ అని ట్విటర్లో ఎన్టీఆర్ కోరారు.
ఇటీవల పవన్కల్యాణ్, అల్లు అర్జున్, కంగనా రనౌత్, శిల్పాశెట్టి కుటుంబం సహా పలువురు తారలు తాము కరోనా బారినపడినట్లు వెల్లడించిన సంగతి తెలిసిందే. పవన్ ఇప్పటికే కరోనా నుంచి కోలుకున్నారు.