పిడుగుపాటుకు మృతి చెందిన బాధితుడి కుటుంబానికి మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నివిధాలుగా అండగా ఉంటానని భరోసానిచ్చారు. ఆదివారం కొల్లాపూర్ మండల పరిధిలోని కుడికిల్ల గ్రామ సమీపంలో వ్యవసాయ పొలంలో ఆరేపల్లి కళ్ళు కృష్ణయ్య పిడుగుపాటుకు మృతి చెందారు.
ఈ విషయం తెలుసుకున్న మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు సోమవారం మృతదేహానికి పూలమాల వేసి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కుటుంబానికి ధైర్యం యిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎవరు అధైర్య పడవద్దన్నారు. అన్ని విధాలుగా కుటుంబాన్ని ఆదుకోవడానికి నేనున్నానని భరోసా కల్పించారు.
ఎలాంటి సమస్య వచ్చినా అందుబాటులో ఉంటానన్నారు. ధైర్యంగా ఉండాలని కుటుంబానికి భరోసా కల్పించారు. ఆయన వెంట జడ్పిటిసి జూపల్లి భాగ్యమ్మ,సింగిల్ విండో డైరెక్టర్ రఘుపతి రావు,మాజీ జెడ్పిటిసి హనుమంతు నాయక్, ఉన్నారు.
ఇంకా శివానందం,మాజీ ఉపసర్పంచ్ బాలయ్య, మంగలి విజయ్, శ్రీ రాములు, గొల్ల ఉషన్న,హరికృష్ణ, రామకృష్ణ తదితరులు ఉన్నారు. అదే విధంగా ఆదివారం వాహనం బోల్తాపడి మృతి చెందిన కుర్వ అనిల్ అంత్యక్రియలలో పాల్గొన్నారు. జూపల్లి అనుచరులు భారీ ఎత్తున తరలి వచ్చారు.