కొల్లాపూర్ కోట లోని ముందు భాగం తనకు రెండు కోట్లకు అమ్మాలని తాను డిమాండ్ చేసినట్లు కొల్లాపూర్ రాజా ఆదిత్య లక్ష్మణరావు చేసిన ఆరోపణలను మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు తీవ్రంగా ఖండించారు. కొల్లాపూర్ కోట ముందు భాగాన్ని తనకు అమ్మనందునే తాను కోర్టులో కేసు వేసినట్లు రాజాగారు చెప్పడం కూడా పూర్తిగా అవాస్తవమని జూపల్లి అన్నారు. కొల్లాపూర్ కోట వెనుక భాగాన్ని ప్లాట్లుగా చేసి అమ్ముతున్నందున తాను ఆ ప్లాట్లు కొంటున్న వారి శ్రేయోభిలాషిగా ఆ స్థలం కోర్టు లిటిగేషన్ లో ఉందని మాత్రమే చెప్పానని జూపల్లి అన్నారు. రాజాగారు తనపై చేసిన ఆరోపణలు శుద్ధ అబద్ధమని ఆయన తీవ్రంగా ఖండించారు. రాజావారు చేసిన ఆరోపణలు వాస్తవమైతే రాములవారి సాక్షిగా రాజావారు ఆ విషయాలు చెబుతారా అని జూపల్లి సవాల్ విసిరారారు. బహిరంగ చర్చకు తాను సిద్ధమేనని బహిరంగ చర్చకు ఆయనే డైరెక్ట్ గా రావాలి ఆయన నేను ముఖా ముఖి మాట్లాడుకుంటాం అని జూపల్లి సవాల్ చేశారు. రాముల వారి సాక్షిగా అబద్దాలు ఎలా చెప్పాలని అనుకుంటే సింగోటం లేదా వెంకటేశ్వర స్వామి టెంపుల్ కు రావచ్చని కూడా జూపల్లి కోరారు. కొల్లాపూర్ కోట ను ప్లాట్లు చేసి అమ్ముకోవడం చట్ట విరుద్ధమని తాను ఇప్పటికీ చెబుతున్నానని ఆయన అన్నారు. ఇప్పుడు ప్లాట్లు కొనుగోలు చేసిన వారు కోర్టు తీర్పు వచ్చిన ఇబ్బంది పడతారని తాను హెచ్చరించాను తప్ప తనకు ఎలాంటి స్వార్ధం లేదని జూపల్లి స్పష్టం చేశారు.
previous post