27.7 C
Hyderabad
March 29, 2024 02: 59 AM
Slider జాతీయం

జస్టిస్ ఎన్ వి రమణ సంచలన వ్యాఖ్యలు

#Justice N V Ramana

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి తనపై తీవ్ర ఆరోపణలు చేస్తూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఫిర్యాదు చేసిన ఉదంతం తర్వాత ఎక్కడా ఏమాత్రం వ్యాఖ్యలు చేయని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ ఎన్ వి రమణ పరోక్షంగా ఆ విషయాలను ప్రస్తావించారు.

సుప్రీం కోర్టు మాజీ న్యాయ‌మూర్తి ల‌క్ష్మ‌ణ్ సంస్క‌ర‌ణ స‌భ‌లో ఆన్ లైన్ ద్వారా ప్ర‌సంగించిన ఆయ‌న ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. జస్టిస్ ఎన్వీ ర‌మ‌ణ త‌న స్పీచ్ లో రాముడిని, ఆయ‌న‌పై వ‌చ్చిన ఆరోప‌ణ‌ల‌ను ప్ర‌స్తావిస్తూ… విద్రోహా శ‌క్తుల‌పై ఆయ‌న గెలుపొందినందుకు మ‌నం అంతా ఆయ‌న్ను గుర్తుపెట్టుకోలేద‌ని, ఆయ‌న గెలిచే క్ర‌మంగా త‌న వాల్యూస్ కు ఆయ‌న ఎంత క‌ట్టుబ‌డి ఉన్నారని జస్టిస్ రమణ అన్నారు.

అందుకోసం ఆయ‌న ఎన్ని బాధ‌లు ప‌డ్డా ఎలా ఎదుర్కొన్నారు అన్న‌ది కూడా ముఖ్య‌మైన‌ద‌ని జస్టిస్ రమణ వ్యాఖ్యానించారు. మ‌న ఆచ‌ర‌ణ మార్గాలే మ‌న ఔన్న‌త్యాన్ని కాపాడుతాయ‌న్నారు. ప్ర‌జ‌ల న‌మ్మ‌క‌మే న్యాయ వ్య‌వ‌స్థ‌కు పెద్ద ఆస్తి అంటూ న‌ర్మ‌గ‌ర్భ వ్యాఖ్య‌లు చేశారు.

Related posts

నక్సల్ ప్రభావిత ప్రాంతాలకు రూ.150 కోట్లు

Satyam NEWS

సామాన్య‌ ప్ర‌జ‌ల ఆశ‌లు… ఆకాంక్ష‌లు నెర‌వేరాయి

Satyam NEWS

రాహుల్ గాంధీకి అందరూ సంఘీభావం తెలపాలి

Satyam NEWS

Leave a Comment