భారత న్యాయ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన అయోధ్య భూ వివాదంపై తీర్పు ఇచ్చిన భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గోగోయ్ నేడు తన చివరి పనిదినాన్ని ప్రత్యేకంగా ముగించారు. తన ధర్మాసనంలో విచారణకు లిస్ట్ అయిన పిటిషన్లకు ఒకేసారి నోటీసులు జారీ చేశారు. ఈనెల 17 వ తేదీన రంజన్ గోగోయ్ పదవీవిరమణ చేయనున్నాను. అందుకోసం ఇదే ఆయనకు భారత ప్రధాన న్యాయమూర్తిగా చివరి పని దినం.అందుకే ప్రధాన న్యాయమూర్తిగా తన చివరి పనిదినాన్ని జస్టిస్ రంజన్ గోగోయ్ శుక్రవారం ప్రత్యేకంగా చేసుకున్నారు. సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రంజన్ గోగోయ్ కు సా 4 గం.లకు వీడ్కోలు పలకనున్నారు. మహారాష్ట్రకు చెందిన జస్టిస్ శరద్ అర్వింద్ బోబ్డే (63) ఈ నెల 17 న చీఫ్ జస్టిస్ రంజన్ గోగోయ్ స్థానంలో భారత సర్వోన్నత న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టనున్నారు.
previous post