కడప జిల్లా రాజంపేట లో పాత్రికేయులకు, భవన నిర్మాణ కార్మికులకు ఆదివారం నిత్యావసర వస్తువులు జువారి సిమెంట్స్ డీలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యం లో పంపిణీ చేశారు.
బైపాస్ రోడ్డులోని ఓ కల్యాణ మండపంలో జరిగిన ఈ కార్యక్రమంకు రాయలసీమ జువారి సిమెంట్ ఇంచార్జీ కిషోర్ రెడ్డి అధ్యక్షత వహించారు.
ముఖ్య అతిథులుగా రాజంపేట మాజీ ఎమ్మెల్యే అకేపాటి అమరనాధ రెడ్డి, వైసీపీ పట్టణ నేత పోలా శ్రీనివాసులు రెడ్డి, వైసీపీ మైనారిటీ నేత గుల్జార్ బాషా, డి.సి.యం.యస్.చైర్మన్ దండు గోపి, వైసీపీ బిసి నేత పసుపు లేటి సుధాకర్, చోప్పా యల్లా రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సభలో వక్తలు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా కరోనాతో కూలీలు ఇబ్బందిపడుతున్నారని, వారిని ఆదుకునే నిమిత్తం ఒక్కో సిమెంట్ మూటపై ఓ రూపాయి వెచ్చించి నిత్యావసర సరుకులు అందించడం అభినందనీయమని ప్రశంసించారు.