35.2 C
Hyderabad
April 20, 2024 17: 54 PM
Slider కడప

జువారీ సిమెంట్స్ ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువులను పంపిణీ

#CoronaHelp

కడప జిల్లా రాజంపేట లో పాత్రికేయులకు, భవన నిర్మాణ కార్మికులకు ఆదివారం నిత్యావసర వస్తువులు జువారి సిమెంట్స్ డీలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యం లో పంపిణీ చేశారు.

బైపాస్ రోడ్డులోని ఓ కల్యాణ మండపంలో జరిగిన ఈ కార్యక్రమంకు రాయలసీమ జువారి సిమెంట్ ఇంచార్జీ కిషోర్ రెడ్డి అధ్యక్షత వహించారు.

ముఖ్య అతిథులుగా రాజంపేట మాజీ ఎమ్మెల్యే అకేపాటి అమరనాధ రెడ్డి, వైసీపీ పట్టణ నేత పోలా శ్రీనివాసులు రెడ్డి, వైసీపీ మైనారిటీ నేత గుల్జార్ బాషా, డి.సి.యం.యస్.చైర్మన్ దండు గోపి, వైసీపీ బిసి నేత పసుపు లేటి సుధాకర్, చోప్పా యల్లా రెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సభలో వక్తలు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా కరోనాతో కూలీలు ఇబ్బందిపడుతున్నారని, వారిని ఆదుకునే నిమిత్తం ఒక్కో సిమెంట్ మూటపై ఓ రూపాయి వెచ్చించి నిత్యావసర సరుకులు అందించడం అభినందనీయమని ప్రశంసించారు.

Related posts

రామ్ గోపాల్ వర్మ కుక్కల కామెంట్

Satyam NEWS

బాలకృష్ణ చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్ కు అనుమతి

Satyam NEWS

కమల వికాసానికి కలిసి వస్తున్న కాలం

Satyam NEWS

Leave a Comment