అన్నమయ్య జిల్లా రాజంపేట లో తెలుగు, తమిళ ప్రేక్షకులకు సుపరిచితుడైన కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ నూతన చిత్రం కోలార్ నగర్ KA-07 షూటింగ్ జరుగుతోంది.ఈ షూటింగ్ అన్నమయ్య డ్యామ్ పరిసర ప్రాంతాల్లో వందలాది మంది జూనియర్ ఆర్టిస్టులతో గత మూడు రోజులుగా జరుగుతోంది.విక్రమ్ ను చూసేందుకు ఆయన బస చేసిన సింధురి హోటల్ వద్దకు వచ్చిన రాజంపేట పరిసరప్రంత అభిమానులతో సందడిగా మారింది.
షూటింగ్ స్పాట్ లో ఎవరిని అనుమతించడం లేదు.షూటింగ్ ముగిసిన తరువాత హోటల్ వద్ద అభిమానులకు అభివాదం చేసి వెళుతున్నారు.సింగం, సింగం 3, నోటాతోపాటు మరెన్నో హిట్ చిత్రాలను నిర్మించింది ప్రముఖ నిర్మాత సంస్థ స్టూడియో గ్రీన్ ఈ పాపులర్ ప్రొడక్షన్ హౌజ్ తన కొత్త చిత్రాన్ని నిర్మిస్తోంది. స్టూడియో గ్రీన్ మేకర్స్ ఆర్యతో సార్పట్టా పరంపర లాంటి సూపర్ హిట్ చిత్రాన్ని డైరెక్ట్ చేసిన పా రంజిత్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు.
విక్రమ్ చివరి సారిగా తెలుగులో వీడింతే సినిమాలో నటించాడు. విక్రమ్ కెరీర్లో ఇది 61వ సినిమా. కాగా కేఈ జ్ఞాన్వేల్ రాజా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్ర నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలపై క్లారిటీ రావలసి ఉంది.