ఈ నెల 25,26 తేదీలలో ఏపీలోని విజయనగరం జిల్లా నెల్లిమర్ల లో జిల్లా కబడ్డీ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్టు కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి ఈశ్వర్ కౌశిక్ తెలిపారు.
ఈ మేరకు జిల్లా కేంద్రంలోని రాజీవ్ క్రీడా ప్రాధికార ప్రాంగణంలో కబడ్డీ టోర్నమెంట్ సెలక్షన్లు జరిగిన సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కబడ్డీ అసోసియేషన్ సభ్యులంతా పాల్గొన్నారు.
గత 30 ఏళ్లుగా కబడ్డీ ఆట శ్వాసగా చేసుకుని రామారావు పదవీ విరమణ చేస్తున్న సందర్భంగా ఈ కబడ్డీ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు.