ప్రస్తుత మార్కెట్లో గిరాకీ ఉన్న కడక్ నాథ్ కోళ్ల పెంపకంతో కరీంనగర్ జిల్లా జూలపల్లి మండలంలోని వడ్కాపూర్ గ్రామానికి చెందిన రేచవేని సతీష్ అనే యువ రైతు ఉపాధి పొందుతున్నాడు. వ్యవసాయంతోపాటు కడక్నాథ్ కోళ్ల పెంపకాన్ని వృత్తిగా ఎంచుకొని నల్లజాతికి చెందిన కోళ్లను మధ్యప్రదేశ్ నుంచి తెప్పించినట్లు తెలిపారు. 60 కోళ్లను రూ. 30వేలను వెచ్చించి కొనుగోలు చేసి తెప్పించినట్లు పేర్కొన్నాడు. కడక్ నాథ్ చికెన్కు డిమాండ్ ఎక్కువగా ఉందని గ్రహించి ఈ రంగంలో రాణించేందుకు ఆసక్తి చూపినట్లు తెలిపాడు. సతీష్ మాట్లాడుతూ సాధారణ రకం కోళ్ల కంటే కడక్నాథ్ చికెన్తో అధిక శాతం పోషకాలు ఉంటాయన్నారు. షుగర్, బీపీ, కొలెస్ట్రాల్ను అదుపులోకి ఉంచుతాయన్నారు. కేజీ చికెన్ ధర రూ. 500 వరకు ఉంటుందని, కోడిగుడ్డు రూ. 30 రూపాయల ధర పలుకుతుందన్నారు. అవసరం ఉన్న వారికి కడక్నాథ్ కోళ్లు అందుబాటులో ఉన్నాయని, కావాల్సిన వారు 9908726512 నంబర్లో సంప్రదించాలని సతీష్ కోరాడు.
previous post