కడప జిల్లా అదనపు ఎస్.పి (పరిపాలన) గా ఎం.ఖాసీం సాహెబ్ బాధ్యతలు చేపట్టారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం జిల్లా ఎస్.పి కే.కే.ఎన్ అన్బురాజన్ ను మర్యాదపూర్వకంగా ఆయన కలిశారు.
అదనపు ఎస్.పి ఖాసీం సాహెబ్ స్వస్థలం కర్నూలు జిల్లా దేవనకొండ మండలం కరివేముల గ్రామం. ఆయన 1989 బ్యాచ్ లో ఎస్.ఐ గా ఎంపికయ్యారు.
శిక్షణా కాలంలో రాష్ట్రంలోనే టాపర్ గా నిలిచి ఉన్నతాధికారుల ప్రశంశలందుకున్నారు. అనంతరం ఎస్.ఐ గా, సి.ఐ గా అనంతపురం జిల్లాలో ఎక్కువగా విధులు నిర్వర్తించారు.
డి.ఎస్.పి గా పి.టి.సి అనంతపురం, ఒంగోలు పి.టి.సి లలో విధులు నిర్వర్తించారు. గుంతకల్ డి.ఎస్.పి గా ఇటీవలి వరకు విధులు నిర్వహిస్తూ పదోన్నతిపై కడప జిల్లా అదనపు ఎస్.పి (పరిపాలన) గా బాధ్యతలు చేపట్టారు.