కడప జిల్లా రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రిని బుధవారం రాష్ట్ర బీజేపీ బృందం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ తనిఖీల్లో బిజెపి రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు,బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాతుగుంట రమేష్ నాయుడు, బిజెపి రాష్ట్ర సలహా మండలి సభ్యులు సాయి లోకేశ్ తదితరులు పాల్గొన్నారు.వారు కేంద్ర ప్రభుత్వం 60 శాతం నిధులు కేటాయించిన ఆక్సిజన్ ప్లాంట్ పరిశీలించారు.ప్రధాని మోడీ ఫొటో లేకుండా జగనన్న ప్రాణవాయువు ప్రచారం చేసుకోవడం పై వారు అభ్యంతరం వ్యక్తం చేశారు.ఆక్సిజన్ వాడడానికి ఆసుపత్రిలో తగిన వసతులు లేవని,ఆసుపత్రిలో 27 మంది వైద్య సిబ్బంది విధుల్లో ఉండవలసి ఉండగా, కేవలం 9 మంది ఉండడం,ఆసుపత్రి అపరిశుభ్రతగా ఉండడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.రాష్ట్ర ప్రభుత్వం ప్రచార కు తప్ప వాస్తవ పరిస్థితులను దృష్టిలో పెట్టుకోవడం లేదని ఆరోపించారు.
next post