కడప జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్లోకి బస్సులు రాకుండా నగరపాలక సంస్థ అడ్డుకుంది. బస్సులు రోడ్డుపై నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏళ్ల తరబడి ఆర్టీసీ బస్టాండ్ కు ఆస్తి పన్ను చెల్లించని కారణంగా నగర పాలక సంస్థ ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
ఆర్టీసీ నుంచి రూ.2 కోట్ల మేర బకాయిలు ఉన్నాయని కార్పొరేషన్ కమిషనర్ ప్రవీణ్చంద్ తెలిపారు. విధిలేని పరిస్థితుల్లో పాతబస్టాండ్ను మూసివేశామని ఆయన అన్నారు. మరోవైపు కార్పొరేషన్ అధికారుల తీరుకు నిరసనగా పాతబస్టాండ్ దగ్గర టీడీపీ, సీపీఎం నేతలు నేతలు ధర్నాకు దిగారు. ముఖ్యమంత్రి సొంత జిల్లాలోనే ఈ విధంగా జరగడం పలువురిని ఆశ్చర్య పరచింది.