నిరాశ్రయులైన రోగులకు అండగా తానున్నానంటూ నిలిచారు కడప డి.ఎస్.పి బి.సునీల్ కుమార్. వివరాల్లోకి వెళితే.. రిమ్స్ ఆస్పత్రిలో అంటురోగాల వార్డులో నా..అంటూ ఎవరూ లేని 15 మంది చికిత్స పొందుతున్నారు.
చలి కాలం నేపథ్యంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్న రోగుల దుస్థితి గమనించిన ఫోరెన్సిక్ వైద్యులు డా. ఆనంద్ కుమార్ కడప డి.ఎస్.పి సునీల్ కుమార్ దృష్టికి తీసుకెళ్లారు.
తక్షణమే డి.ఎస్.పి సునీల్ కుమార్ స్పందించి వారికి బెడ్ షీట్లు అందచేసి తన దాతృత్వాన్ని చాటుకున్నారు.
తమపై మానవత దృక్పథంతో బెడ్ షీట్లు అందచేసిన కడప డి.ఎస్.పి సునీల్ కుమార్ కు నిరాశ్రయులైన రోగులు ధన్యవాదాలు తెలిపారు.
తమ లాంటి అనాధ రోగులకు పోలీసు శాఖ అండగా ఉందన్న భరోసా కల్పించడం ఎన్నటికీ మారువలేమన్నారు. కార్యక్రమంలో రిమ్స్ ఫోరెన్సిక్ వైద్యులు డా. ఆనంద్ కుమార్ పాల్గొన్నారు.