30.7 C
Hyderabad
April 19, 2024 07: 13 AM
Slider కడప

అనాధ మృతదేహానికి రాజంపేట డీఎస్పీ అంత్యక్రియలు

#Kadapa DSP

కడప జిల్లా రాజంపేట పట్టణంలోని ప్రభుత్వాసుపత్రిలో గురువారం అనారోగ్యంతో ఒంగోలుకు చెందిన శ్రీనివాసులు (55) మృతి చెందాడు.

శ్రీనివాసులు మనవడు రవి మా తాత మృతదేహానికి దహన సంస్కారాలు చేసే వారు ఎవరు లేరని రోదిస్తున్నాడన్న సమాచారం  తెలుసుకున్న రాజంపేట డి.ఎస్.పి నారాయణస్వామి రెడ్డి శ్రీనివాసులు మృతదేహానికి హిందూ సాంప్రదాయ పద్ధతిలో దహన సంస్కారాలు నిర్వహించాలని ఏ ఎస్ ఐ మురళి, హెడ్ కానిస్టేబుల్ రాజులకు అప్పగించారు.

వారిద్దరూ ఘనంగా దహన సంస్కారాలు నిర్వహించారు. దహన సంస్కారాల అనంతరం శ్రీనివాసులు మనవడు రవి డీఎస్పీకి ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది మానవత స్వచ్ఛంద సేవ శాంతి రథం డ్రైవర్ చిట్టి నాయుడు తదితరులు పాల్గొన్నారు.

Related posts

విజయనగరం పోలీసుల “స్పందన” కు 27 ఫిర్యాదులు…

Satyam NEWS

శ్రీవారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

Satyam NEWS

Over-The-Counter Cbd Recretaional Illinois Hemp Shop Rules For Exporting Hemp Cbd

Bhavani

Leave a Comment