కడప జిల్లా రాజంపేట నియోజకవర్గంలో ఆరు మండలాల్లో మంగళ వారం జనసేన నాయకులు, కార్యకర్తలను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేసన్ కు తరలించారు. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ జిల్లా ఎంప్లాయ్ మెంట్ కార్యాలయాల్లో వినతి పత్రాలు సమర్పించాలని పిలుపు నిచ్చారు.
ఈ నేపధ్యంలో రాజంపేట నియోజకవర్గ పరిధిలోని రాజంపేట, నందలూరు, ఒంటిమిట్ట, సిద్దవటం, సుండుపల్లె, వీరబల్లె మండలాల్లోని జనసేన కార్యకర్తలను,నాయకులను ముందస్తు జాగ్రత్తగా అదుపులోకి తీసుకున్నారు. జిల్లా ఉపాధి అధికారికి వినతిపత్రం అందించెందుకు వెళుతున్న జనసేన రాష్ట్ర కార్యదర్శి సయ్యద్ ముఖరం చాన్ వెళుతుండగా పుల్లంపేట పోలీస్ లు అదుపులోకి తీసుకొన్నారు.
రాష్టంలో నిరోద్యోగ యువత పడుతున్న బాధలకు బాసటగా జనసైనికులు పనిచేస్టున్నారు అన్నారు.
సి ఎం జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల ముందు పాదయాత్రలో ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేదని. నిరుద్యోగ యువతను మోసం చేశారన్నారు. తమ అరెస్ట్ అప్రజాస్వామిక మని జనసేన నేతలు ఖండించారు.
110 స్థానాల్లో టీఆర్ఎస్ గెలుపు ఖాయం