కడప జిల్లా పోలీసులు బృహత్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కోవిడ్ 19 లక్షణాలతో ఆసుపత్రికి వచ్చే వారందరికి రోజు వారీ అవసరాలు తీర్చుకోవడానికి అవసరమైన వస్తువులను అందచేయాలని నిర్ణయించారు. ఈ మేరకు కడప నగర శివారులోని ఫాతిమా మెడికల్ కళాశాలలో జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో పోలీసు సహాయక కేంద్రం ప్రారంభించారు. కరోనా లక్షణాలు ఉన్న వ్యక్తులకు అవసరమయ్యే అన్ని రకాల వస్తువులను అందజేయనున్నట్లు పోలీసులు తెలిపారు.
కడప డిఎస్పీ సూర్యనారాయణ ఆధ్వర్యంలో ఈ సహాయక కేంద్రం ఏర్పాటు అయింది. కరోనా లక్షణాలు ఉన్న వ్యక్తులకు పోలీసులు అండగా ఉంటారని కడప పోలీసులు చాటి చెబుతున్నారు. బకెట్స్, సోప్స్, స్యానిటైజర్లు, టవల్స్, ఇతర 22 రకాల వస్తువులను పోలీసులు కరోనా పేషంట్లకు ఇస్తారు.