రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన హోమ్ గార్డు బాబా ఫక్రుద్దీన్ (41) మృతదేహనికి కడప జిల్లా ఎస్.పి కే.కే.ఎన్ అన్బు రాజన్ ఘన నివాళి అర్పించారు. 23 న అర్ధరాత్రి అలవలపాడు రింగ్ రోడ్డు దగ్గర రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన హోం గార్డు బాబా ఫక్రుద్దీన్(HG 820) మెరుగైన చికిత్స నిమిత్తం తిరుపతి కి తరలిస్తుండగా మృతి చెందాడు. గత 15 సంవత్సరాలుగా హోమ్ గార్డుగా పోలీసు శాఖ లో విధులు నిర్వహిస్తున్న బాబా ఫక్రుద్దీన్ ప్రస్తుతం పులివెందుల రూరల్ సి.ఐ వాహన డ్రైవర్ గా విధులు నిర్వహిస్తున్నాడు. పులివెందుల పట్టణంలోని గృహంలో బాబా ఫక్రుద్దీన్ భౌతిక కాయానికి జిల్లా ఎస్.పి నివాళులు అర్పించారు. కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని ఎస్.పి భరోసా ఇచ్చారు. అంకితభావం తో విధులు నిర్వర్టించే బాబా ఫక్రుద్దీన్ మరణం పోలీస్ శాఖకు తీరని లోటని జిల్లా ఎస్.పి అన్నారు. దివంగత హోమ్ గార్డుకు కు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. జిల్లా ఎస్పీ వెంట పులివెందుల రూరల్ సి.ఐ రవీంద్రనాధ్ రెడ్డి, ఎస్.ఐ చిరంజీవి, సిబ్బంది ఉన్నారు.