జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గ ప్రజల గుండెల్లో సుస్థిరంగా నిలిచిపోయిన నేత మాజీ విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి కి ఘన్పూర్ నియోజకవర్గ టీఆరెస్ కార్యకర్తలు, అభిమానులు ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కడియం శ్రీహరి ఓటమి ఎరుగని మహా నేత అని,అయితే రాజకీయ నేతగా ఎదగాలనుకుంటే ప్రజా సమస్యలపై అవగాహన ఉండాలని, జన సమస్యలను అవగతం చేసుకున్నపుడు మాత్రమే ప్రజల మనసులో చీర స్థాయి గా నిలవగల్గుతారని అన్నారు. అలాంటి నిజాయితీని అర్థం చేసుకున్న ప్రజలు కడియం కు గుండెల్లో గుడి కట్టారన్నారు.
కడియం వ్యక్తిత్వం ఎందరికో ఆదర్శమని వారు తెలిపారు. రాజకీయాల్లో ఇచ్చిన మాటకు కట్టుబడేవారు కొందరే ఉంటారని, అలాంటి వారిలో కడియం శ్రీహరి ముందుంటారన్నారు. ఎన్నికలప్పుడు తానిచ్చిన ప్రతి హామీని నెరవేర్చేందుకు ప్రయత్నిస్తూ నిత్యం నియోజకవర్గం లోని ప్రజలతో… చిరునవ్వుతో అందరినీ పలకరించడం ఆయన నైజం అని కొనియాడారు.