ఉప్పల్ నియోజకవర్గం పరిధిలోని మీర్ పేట హౌసింగ్ బోర్డు కాలనీ డివిజన్ పరిధిలో గల తిరుమలనగర్ పోచమ్మ ముత్యాలమ్మ అమ్మవారి దేవాలయం రాజగోపుర శిఖర కలశ స్థాపన మహోత్సవం కన్నుల పండుగ జరిగింది. శ్రీ విద్యారణ్య భారతి స్వామి దివ్య మంగళ శాసనములతో ఈ కార్యక్రమం దివ్వమైన వైదికకార్యక్రమం జరిగిన తీరుగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కార్పొరేటర్ జెరిపోతుల ప్రభుదాస్ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఎన్ వి ఎస్ ఎస్ ప్రభాకర్, ఆలయ ఛైర్మన్ సుధాకర్ అయ్యంగార్, రాంప్రదీప్, బ్రహ్మచారి, తిమ్మారెడ్డి, రాజు, హనుమాన్ దాస్ గౌడ్, మల్లేశ్ గౌడ్, బాలరాజు తదితరులు పాల్గొన్నారు.
previous post