భారత రత్న డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ ప్రపంచం మొత్తం గర్వించదగిన మహనీయుడని అంబర్ పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ అన్నారు. డాక్టర్ అంబేద్కర్ 129 వ జయంతిని పురస్కరించుకుని ఆయన కృష్ణ నగర్ లోని ఆయన విగ్రహానికి పూల మాల వేసి ఎమ్మెల్యే వెంకటేష్ నివాళి అర్పించారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకుడు మహేందర్, దళిత చైతన్య వేదిక సభ్యుడు గాలిపాళ్లి శంకర్, ముద్దం బాలాజీ, ఆర్ కె బాబు, రాము, భూపతి, లక్ష్మణ దొరబాబు, జ్ఞానేశ్వర్ టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు బంగారు శ్రీనివాస్, దోర్నాల భరత్ రాజ్, ఎం శివ, శివకుమార్ గుప్త తదితరులు పాల్గొన్నారు.
అదే విధంగా భారత రాజ్యాంగ నిర్మాత, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 129 వ జయంతి వేడుకల సందర్భంగా కృష్ణ నగర్ లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి బీజేపి నగర ఉపాధ్యక్షులు కే రమేష్ యాదవ్ నివాళి అర్పించారు.