అనంతపురం జిల్లాలో ఆర్ డి టి క్రీడాప్రాంగణం వేదికగా ఈ నెల 26 నుండి వచ్చే నెల మార్చి 2వ తేదీ వరకు ఏపీ సీనియర్ (పురుషుల, మహిళల) సాఫ్ట్ బాల్ చాంపియన్ షిప్ పోటీలు జరగనున్నాయి.
ఈ పోటీలలో శ్రీకాకుళం జిల్లా నుండి ప్రాతినిధ్యం వహించే క్రీడాకారులకు కళింగాంధ్ర యూత్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు, జిల్లా సాఫ్ట్ బాల్ అసోసియేషన్ అధ్యక్షులు పైడి సురేష్ బాబు (నవీన్) తమ అసోసియేషన్ తరపున ఆర్థిక సహాయాన్ని అందజేశారు.
గురువారం స్థానిక శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాల మైదానంలో జరిగిన వీడ్కోలు కార్యక్రమంలో ఆయన క్రీడాకారులకు పదివేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించడంతోపాటు ఏకరూప దుస్తులు అందజేసి ఉదారతను చాటుకున్నారు.
రాష్ట్రస్థాయి పోటీల్లో క్రీడాకారులంతా అత్యుత్తమ ప్రతిభ కనబరిచి జిల్లాకు పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని , తద్వారా ఉజ్వల భవిష్యత్తును అందుకోవాలని ఈ సందర్భంగా నవీన్ ఆకాంక్షించారు.
క్రీడలను, క్రీడాకారులను ప్రోత్సహించేందుకు కళింగాంధ్ర యూత్ ఆసోసియేషన్ ఎల్లప్పుడూ ముందుంటుందని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో సాఫ్ట్ బాల్ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మెుజ్జాడ వెంకటరమణ , గ్రిగ్స్ సెక్రటరీ కె మాధవరావు,పి డిలు పైడి సునీత , వాసుదేవాచారి, వినోద్ , మధుసూదన్, మల్లేష్, కళింగాంధ్ర యూత్ అసోసియేషన్ సభ్యులు నరసింహారావు, సిహెచ్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.