నిజామాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా కల్వకుంట కవిత ఘన విజయం సాధించారు.
ఆమె కు వ్యతిరేకంగా పోటీ చేసిన కాంగ్రెస్, బిజెపి అభ్యర్ధులు డిపాజిట్లు కోల్పోయారు.
నిజామాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గానికి ఏర్పడిన ఖాళీలో ఈ ఉప ఎన్నిక జరిగింది.
టీఆర్ఎస్ అభ్యర్ధి కల్వకుంట్ల కవితకు మొత్తం 728 ఓట్లు రాగా బిజెపి అభ్యర్ధి పి లక్ష్మీనారాయణకు 56 ఓట్లు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి బి సుభాష్ రెడ్డికి 29 ఓట్లు వచ్చాయి. మొత్తం 10 ఓట్లు చెల్లకుండా పోయాయి.