అనారోగ్యంతో మరణించిన రాములమ్మ అనే మహిళ కుటుంబానికి కల్వకుర్తి మున్సిపల్ చైర్మన్ ఎడ్మ సత్యం తనకు తోచిన సాయం చేశారు.
వెల్దండ మండలం రాచూర్ గ్రామానికి చెందిన రాములమ్మ అనారోగ్యంతో కొద్దీ రోజుల క్రితం మరణించింది. ఆమెకు ఇద్దరు ఆడపిల్లలు, ఇద్దరు మగ సంతానం ఉన్నారు. అందరికి పెళ్లిళ్లు అయిపోయాయి. అయితే కుమారులు మానసిక వ్యాధి తో బాధ పడుతున్నారు.
ఈ విషయం గురించి TRSV నాయకులు ఆనంద్ గౌడ్, కల్వకుర్తి మున్సిపల్ చైర్మన్ ఎడ్మ సత్యంకు కలిసి ఆ కుటుంబానికి సహాయం చేయాలని కోరారు.
దానికి ఆయన స్పందించి 50 కేజీల బియ్యాన్ని అందించమని చెప్పగా, నేరుగా వాటిని ఆనంద్ గౌడ్ రాములమ్మ కుటుంబానికి అందించారు. రాములమ్మ కుటుంబానికి మనోధైర్యం చెప్పారు.
పుట్టిన ప్రతీ మనిషి చనిపోక తప్పదని గుండె నిబ్బరం చేసుకొని ఉండాలని ఆనంద్ గౌడ్ అన్నారు. TRS పార్టీ గ్రామ అధ్యక్షుడు షోరూమ్ రాజు, నిరంజన్, నాగరాజు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.