27.7 C
Hyderabad
March 29, 2024 04: 17 AM
Slider మహబూబ్ నగర్

కల్యాణ లక్ష్మీ చెక్కులను పంపిణీ చేసిన కొల్లాపూర్ ఎమ్మెల్యే

#Kollapur MLA

మంజూరు అయిన కల్యాణ లక్ష్మీ చెక్కులను కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి నేడు వివిధ గ్రామాల లబ్ధిదారులకు అందచేశారు. పానుగల్ మండలంలోని తహశీల్దార్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో మొత్తం 55 మంది లబ్దిదారులు 55 లక్షల రూపాయల చెక్కులను అందుకున్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి వారికి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ శ్రీధర్ రెడ్డి, జడ్పీటీసీ లక్ష్మీ,విండో చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి,TRS పార్టీ మండల అధ్యక్షుడు రాముయాదవ్, తహశీల్దార్ శ్రీరాములు, వివిధ గ్రామాల సర్పంచ్ లు,ఎంపిటిసిలు, నాయకులు పాల్గొన్నారు.

Related posts

సీనియర్ జర్నలిస్ట్ వివాహానికి హాజరైన ఎమ్మెల్యే సీతక్క

Satyam NEWS

100 భాషల్లో వెతకవచ్చు

Murali Krishna

ఏపీలో ఆగస్టు 16 నుంచి పాఠశాలల పునఃప్రారంభం

Satyam NEWS

Leave a Comment