మంజూరు అయిన కల్యాణ లక్ష్మీ చెక్కులను కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి నేడు వివిధ గ్రామాల లబ్ధిదారులకు అందచేశారు. పానుగల్ మండలంలోని తహశీల్దార్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో మొత్తం 55 మంది లబ్దిదారులు 55 లక్షల రూపాయల చెక్కులను అందుకున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి వారికి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ శ్రీధర్ రెడ్డి, జడ్పీటీసీ లక్ష్మీ,విండో చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి,TRS పార్టీ మండల అధ్యక్షుడు రాముయాదవ్, తహశీల్దార్ శ్రీరాములు, వివిధ గ్రామాల సర్పంచ్ లు,ఎంపిటిసిలు, నాయకులు పాల్గొన్నారు.