ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో మంజూరైన 248 కల్యాణలక్ష్మి చెక్కులను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ నేడు పంపిణీ చేశారు.
భక్తరామదాసు కళాక్షేత్రం లో జరిగిన కార్యక్రమంలో రూ2.48 కోట్లు విలువైన చెక్కులను మంత్రి లబ్ధిదారులకు పంపిణీ చేశారు.
నేటి వరకు నియోజకవర్గంలో 3500 చెక్కులకు గాను రూ.25 కోట్లు పంపిణీ చేశామని ఈ సందర్భంగా మంత్రి పేర్కొన్నారు.