పేదింటి ఆడబిడ్డకు కొండంత భరోసాగా కళ్యాణ లక్ష్మీ అని దేవరకొండ శాసన సభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో చందంపేట మండలానికి చెందిన 25 మంది లబ్ధిదారులకు రూ.25లక్షల కళ్యాణ లక్ష్మీ చెక్కులను ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే సీఎం కేసీఆర్ లక్ష్యం అని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతూ దేశానికే మార్గదర్శకంగా ఉన్నారని ఆయన తెలిపారు.
పేదల సంక్షేమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుందని అందులో భాగంగా ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకం పేద ప్రజలకు ఎంతో ఆసరా గా నిలుస్తున్నదని ఆయన తెలిపారు.
ఆడబిడ్డ వివాహానికి ఆర్థికంగా ఆదుకొని ప్రభుత్వం అండగా నిలుస్తుందని, ప్రతి పేదింటి ఆడబిడ్డకు పెళ్లికానుకగా 1,00,116 /- ఇస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని ఆయన గుర్తు చేశారు. ప్రభుత్వ ఆసుపత్రి లో ప్రసవం కేసీఆర్ కిట్ మొదలుకొని ఆడపిల్ల పెళ్లి చేసే వరకు ఇంట్లో పెద్దన్నగా ఎంతో మంది పేద కుటుంబాలకు ఆయన అండగా నిలిచారని అన్నారు.
ఈ పథకాలతో రాష్ట్రవ్యాప్తంగా వేల కుటుంబాల్లో వెలుగు నింపిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కి దక్కుతుంది అని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ పార్వతి,జడ్పీటీసీ రమావత్ పవిత్ర, TRS మండల అధ్యక్షులు కేతవత్ లక్ష్మణ్ నాయక్,డిప్యూటీ తహశీల్దార్ ముక్తార్, TRS నాయకులు కొండల్ రెడ్డి,వీర రెడ్డి, బొడ్డుపల్లి కృష్ణ, రమేష్, బాను తదితరులు పాల్గొన్నారు