కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని మార్కెట్ యాడ్ కార్యాలయ ఆవరణలో కల్యాణలక్ష్మి చెక్కులను ఎంపిపి అశోక్ పటేల్ లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుపేద కుటుంబాలకు కల్యాణలక్ష్మి పథకం గొప్ప వరం లాంటిదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు తెరాస అధ్యక్షులు వెంకట్రావు దేశాయి, మాజీ మార్కెట్ కమిటీ అధ్యక్షులు సీనియర్ నాయకులు రాజు, తెరాస ప్రధాన కార్యదర్శి రాంచందర్, రెవెన్యూ సీనియర్ సహాయకులు రాచప్ప,తెరాస టౌన్ అధ్యక్షులు అవారి శ్రీనివాస్, నాయకులు బొమ్మల లక్ష్మణ్ ,ఆయా గ్రామాల సర్పంచ్లు ఎంపీటీసీలు సొసైటీ,మార్కెట్ కమిటీ డైరెక్టర్లు లబ్ధిదారుల కుటుంబసభ్యులు పాల్గొన్నారు. జీ లాలయ్య సత్యం న్యూస్ రిపోర్టర్ జుక్కల్ నియోజకవర్గం