28.7 C
Hyderabad
April 20, 2024 06: 30 AM
Slider ముఖ్యంశాలు

30న కళ్యాణం, 31న పుష్కర పట్టాభిషేకం

#ajay

ఈ నెల 30వ తేదిన శ్రీరామ నవమి పురస్కరించుకుని భద్రాద్రి శ్రీసీతారామచంద్ర స్వామి వారి కళ్యాణం ఈసారి అంగరంగ వైభవంగా నిర్వించేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పష్టం చేశారు. రెండో అయోధ్యగా భాసిల్లుతున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో స్వామివారి కల్యాణ మహోత్సవం వేలాదిగా భక్తజన సందోహనం నడుమ వైభవోపేతంగా ఈనెల 30న జరిగే స్వామివారి కళ్యాణ ఉత్సవం కై భక్తులకు ఏర్పాటు చేయాల్సిన సౌకర్యాల ఏర్పాట్లపై రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయలో జిల్లా కలెక్టర్ అనుదీప్ అధ్వర్యంలో ఆలయ అధికారులు, పోలీస్, పంచాయతిరాజ్, విద్యుత్, రవాణా, గ్రామ పంచాయతి, ఆర్టీసి, వైద్య ఆరోగ్య, ఇరిగేషన్, ఫైర్, రెవెన్యూ, ఎండోమెంట్ సంభందిత శాఖల అధికారులు, ఆలయ అర్చకులతో సమీక్ష నిర్వహించారు. ఈనెల 30న జరగనున్న రాములవారి కల్యాణం, 31న పుష్కర పట్టాభిషేకం నేపథ్యంలో ఇప్పటి వరకు చేపట్టిన చర్యలపై జిల్లా కలెక్టర్ అనుదీప్ ను ఆయా వివరాలు అడిగి తెలుసుకున్నారు. కళ్యాణ మహోత్సవంకు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, ఇతర ప్రముఖులు వచ్చే అవకాశం ఉన్నందున అన్ని చర్యలు చేపట్టామని జిల్లా కలెక్టర్ అనుదీప్ వివరించారు.

ఇప్పటి వరకు 200 క్వింటాల తలంబ్రాలు, ప్రతి ఒక్కరూ కళ్యాణం తిలకించేందుకు 6 భారీ LCD లు, తెప్పోత్సవం వద్ద ప్రమాద హెచ్చరిక బోర్డ్లు, 200 మంది స్విమ్మర్లు, 135 వివిధ రకాల బోట్స్, ఎక్కడికక్కడ తగు సిబ్బంది, సిబ్బంది వారి విధులకు అనుగుణంగా జాకెట్స్, 75 శాతం వసతి సౌకర్యాలు, పబ్లిక్ టాయిలెట్స్, విద్యుత్ దీపాలు, 4 ఫైర్ ఇంజన్లు, సిగ్నల్ ఇబ్బంది లేకుండా క్షుణ్ణమైన సమాచారం కోసం 30 ప్రత్యేక హ్యాండ్ సెట్స్ తదితర ఎర్పాటు చేశామన్నారు. భక్తులకు సౌకర్యంగా ఉండేందుకు 25 సమాచార కేంద్రాలు ఎర్పాటు చేస్తామని, అందులో వేదిక, కళ్యాణం వివరాలు, సమయంతో కూడిన 25 వేలు కరపత్రలు ముద్రిస్తున్నామని, ప్రతి కేంద్రంలో వెయ్యి కరపత్రాలు ఉంచుతామని పేర్కొన్నారు. సీతారామ కళ్యాణమహోత్సవాన్ని తిలకించేందుకు సుదూర ప్రాంతాల నుండి తరలివచ్చే అశేష భక్తులకు సకల సౌకర్యాలు కల్పించాలని మంత్రి పువ్వాడ పేర్కొన్నారు.

నిర్దేశించిన పనులన్నీ 28వ తేదీ కల్లా శ్రీరామ నవమి పనులు పూర్తచేయాలని, మిథిలా స్టేడియం స్వామివారి కళ్యాణ మండపం వద్ద భక్తులకు ఇబ్బందులు లేకుండా అవసరమైన సౌకర్యాల ఏర్పాట్లు చేయాలన్నారు. భక్తుల తాకిడి అధికంగా ఉండనున్న నేపథ్యంలో అవసరమైతే సి‌ఆర్‌పి‌ఎఫ్  బలగాలను వినియోగించుకోవాలని, వరంగల్, ఖమ్మం జిల్లా పోలీసులను కూడా వినియోగించుకుని పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, ఎమ్మెల్సీ తాతా మధు, ఎమ్మెల్యే పొడెం వీరయ్య, జెడ్ పి చైర్మన్ కొరం కనకయ్య, జిల్లా ఎస్పీ వినీత్ , అదనపు వెంకటేశ్వర్లు, ఆలయ ఈఓ రమాదేవి , వివిధ శాఖల జిల్లా అధికారులు ఉన్నారు.

Related posts

సూప‌ర్ మార్కెట్స్ లో ఫ్రైడే మూవీస్ ఏటిటి సినిమా టిక్కెట్లు

Satyam NEWS

గజ్వేల్ లో బీసీ బంధు పంపిణీ

Bhavani

సామాన్యుడి కోసం తప్ప స్నేహితుల కోసం కాదు

Satyam NEWS

Leave a Comment