దక్షిణ కాశీగా పేరు పొందిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి కల్యాణ మహోత్సవాలు నేడు ప్రారంభం అయ్యాయి.
సాధారణంగా ప్రతి శైవ క్షేత్రంలో శివరాత్రి రోజున స్వామి వారికి కల్యాణ మహోత్సవం నిర్వహిస్తాయి. అయితే వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి కల్యాణోత్సవాలు మాత్రం ఫాల్గున శుద్ధ విదియ నుంచి షష్టి వరకూ నిర్వహిస్తారు.
కామదహనం పూర్తి అయిన తర్వాతి రోజున శ్రీ రాజరాజేశ్వర స్వామివారి కల్యాణోత్సవానికి శ్రీకారం చుడతారు. అదే విధంగా నేడు కల్యాణోత్సవాలను గణపతి పూజతో ప్రారంభించారు.
సాయంత్రం అంకురార్పణ జరుగుతుంది. రేపు అంటే 31వ తేదీన స్వామి వారికి మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం అనంతరం కల్యాణ మహోత్సవం జరుగుతుంది.
నాలుగవ రోజు రథోత్సవం ఉంటుంది. అన్ని కార్యక్రమాలను వేదపండితులు ఆగమోత్తంగా నిర్వహిస్తారు. అయితే కరోనా కారణంగా భక్తులను పెద్ద ఎత్తున అనుమతించడం లేదు.