కమ్మ వాళ్లు తలచుకుంటే ఎవరో ఏదో అయిపోతారని మాజీ ఎంపి రాయపాటి సాంబశివరావు అనుకోవడం ఎంతో పొరబాటని మంత్రి అనిల్ కుమార్ అన్నారు. కమ్మ వారు తలచుకుంటే ఏమీ కాదని ప్రజలు ఏదైనా అనుకుంటేనే అది జరుగుతుందని ఆయన తెలిపారు.
ప్రజలు తలచుకున్నారు కాబట్టే చంద్రబాబు, రాయపాటి ఐపోయారని మంత్రి ఎద్దేవా చేశారు. ఈ ఎన్నికల్లో టీడీపీకి 23 సీట్లు వచ్చినా బుద్ధి రాలేదని, వచ్చే ఎన్నికల్లో 2 లేదా 3 సీట్లు వస్తాయని ఆయన ఎగతాళి చేశారు. కరోనా వైరస్ పై సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రతి రోజు సమీక్ష చేస్తున్నారని, ఆయన పబ్లిసిటీకి దూరంగా పని చేస్తున్నారని మంత్రి అన్నారు.
జగన్మోహన్ రెడ్డి పని తీరును జాతీయ మీడియా ప్రశంసించిందని ఆయన తెలిపారు. చంద్రబాబు మీడియా సమావేశాలు పెట్టి లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని, పక్క రాష్ట్రంలో ఉండి చంద్రబాబు విమర్శలు చేస్తున్నారని, హైదరాబాద్ లో ఉండి చంద్రబాబు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మంత్రి ఎద్దేవా చేశారు. ప్రభుత్వంపై వెధవ రాజకీయం చేస్తూ టీడీపీ నేతలు సునకానందం పొందుతున్నారని మంత్రి అన్నారు.