విజయవాడ కనకదుర్గ దేవస్థానం కార్యనిర్వహణాధికారిగా పని చేస్తున్న సురేష్ నియామకాన్ని రాష్ట్ర హైకోర్టు రద్దు చేసింది. దుర్గ గుడి ఈఓ గా సురేష్ నియామకాన్ని సవాలు చేస్తూ హై కోర్ట్ పోతిని మహేష్ రిట్ పిటిషన్ దాఖలు చేశారు.
దుర్గ గుడి ఇవో గా పోస్టింగ్ ఇవ్వడానికే సురేష్ కు ప్రమోషన్ ఇచ్చారని హైకోర్టు అభిప్రాయపడింది. ప్రమోషన్ కూడా నిబంధనలకు ఇచ్చారని రాష్ట్ర హైకోర్టు భావించింది. దాంతో సురేష్ నియామకాన్ని రద్దు చేసింది. తగిన క్యాడర్ వ్యక్తిని ఇవో గా నియమించాలని కోర్టు ఆదేశాలిచ్చింది.