రాష్ట్రంలో పంచాయితీ ఎన్నికలు ప్రశాంతంగా,ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా సమర్ధవంతంగా నిర్వహించింది…రెవిన్యూ,పోలీస్ యంత్రాంగం. మరీ ముఖ్యంగా విజయనగరం జిల్లాలో రెండో ధశ నుంచీ చివరి దశ వరకు పంచాయితీ ఎన్నికలు ప్రశాంతంగానే ముగిసాయి.
నాల్గొ,చివరి విడత పోలింగ్ లో..దాదాపు 85 శాతం నమోదు అయి రికార్డు సృష్టించించింది.అందుకు రెవిన్యూ,పోలీస్ శాఖలు సంయుక్తంగా సమర్ధవంతంగా కలిసి పని చేయడం వల్లనే ప్రశాంతంగా ఎన్నికలు ముగిసాయి.
అయితే వెనువెంటనే వచ్చిన మున్సిపల్ ఎన్నికలపై అన్ని జిల్లాలు సమాయత్త మవుతున్నాయి.ఇందులో భాగంగా రాష్ట్ర గిరిజన సంక్షేమ కార్యదర్శి కాంతిలాల్ దిండే ను విజయనగరం జిల్లా ఎన్నికల పరిశీలకులుగా ఎలక్షన్ కమీష|న్ నియమించింది.
ఈ మేరకు విజయనగరం వచ్చిన ఆయన…కలెక్టరేట్ లో…కలెక్టర్ డా.హరిజవహర్ లాలు,ఎస్పీ రాజకుమారీలతో సమావేశం అయ్యారు. కలెక్టర్ ,ఎస్పీలతోనే కాకుండా…జాయింట్ కలెక్టర్ లు డా.జి.సి.కిషోర్ కుమార్, డా.ఆర్. మహేష్ కుమార్, జె. వెంకట రావు, ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ కట్టా సింహాచలంతో కూడా ఎన్నికల పరిశీలకులు కాంతిలాల్ దిండే సమావేశమయ్యారు. విశేషమేంటంటే…గతంలో విజయనగరం జిల్లా కలెక్టర్ గా కాంతీలాల్ దిండే పని చేసారు.