33.2 C
Hyderabad
April 26, 2024 02: 35 AM
Slider జాతీయం

కపలవాయి విజయ కుమార్ కు ప్రతిష్టాత్మక GJC అవార్డు

#vijayakumar

కరోనా కష్ట కాలంలో మానవాళికి అత్యంత విలువలైన సేవలు అందించిన బంగారం వర్తకులను ఆల్ ఇండియా జెమ్ అండ్ జ్యువెలరీ డొమెస్టిక్ కౌన్సిల్ (GJC), జెమ్ అండ్ జ్యువెలరీ ఇండియా ఇంటర్నేషనల్ ఫెయిర్(GJIIF) ఘనంగా సత్కరించాయి.

చెన్నై లోని హోటల్ ఐటిసీ గ్రాండ్ సోలా ఈ నెల 22న జరిగిన ఈ కార్యక్రమంలో ది ఏ.పి.బులియన్ అసోసియేషన్ అధ్యక్షుడు కపలవాయి విజయ కుమార్ ఈ అవార్డును అందుకున్నారు. GJC (Past Chairman), తమిళనాడు డైమండ్ అసోసియేషన్ అధ్యక్షుడు అనంత పద్మనాభన్, తమిళనాడు జ్యువెలరీ అసోసియేషన్ ప్రతినిధి జయంతిలాల్ సంయుక్తంగా ఈ అవార్డులను ఆయనకు అందచేశారు.

ఇరవై ఎనిమిది రాష్ట్రాలలో పన్నెండు మంది ఈ అవార్డులకు ఎంపికైనారు. వీరందరూ కూడా కరోనా సమయంలో చాలా గొప్ప హృదయంతో ప్రజలకు రకరకాల  సేవలు అందించారు.

అత్యవసర పరిస్థితుల్లో జనాలకు నిత్యావసర వస్తువులను భారీ ఎత్తున పంపిణీ చేశారు. మన దేశంలో అత్యంత ప్రాధాన్యత కలిగిన GJC, GJIIF అవార్డులను కపలవాయి విజయ కుమార్ అందుకోవడంపై ఏ.పి. బులియన్ కార్యవర్గ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.

Related posts

వేగంగా సాగుతున్న వై ఎస్ వివేకా మర్డర్ కేసు దర్యాప్తు

Satyam NEWS

సోల్జ‌ర్‌కు శాల్యూట్…

Satyam NEWS

సుప్రీం ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ఎన్‌.వి.రమణ ప్రమాణస్వీకారం రేపు

Satyam NEWS

Leave a Comment