కరోనా కష్ట కాలంలో మానవాళికి అత్యంత విలువలైన సేవలు అందించిన బంగారం వర్తకులను ఆల్ ఇండియా జెమ్ అండ్ జ్యువెలరీ డొమెస్టిక్ కౌన్సిల్ (GJC), జెమ్ అండ్ జ్యువెలరీ ఇండియా ఇంటర్నేషనల్ ఫెయిర్(GJIIF) ఘనంగా సత్కరించాయి.
చెన్నై లోని హోటల్ ఐటిసీ గ్రాండ్ సోలా ఈ నెల 22న జరిగిన ఈ కార్యక్రమంలో ది ఏ.పి.బులియన్ అసోసియేషన్ అధ్యక్షుడు కపలవాయి విజయ కుమార్ ఈ అవార్డును అందుకున్నారు. GJC (Past Chairman), తమిళనాడు డైమండ్ అసోసియేషన్ అధ్యక్షుడు అనంత పద్మనాభన్, తమిళనాడు జ్యువెలరీ అసోసియేషన్ ప్రతినిధి జయంతిలాల్ సంయుక్తంగా ఈ అవార్డులను ఆయనకు అందచేశారు.
ఇరవై ఎనిమిది రాష్ట్రాలలో పన్నెండు మంది ఈ అవార్డులకు ఎంపికైనారు. వీరందరూ కూడా కరోనా సమయంలో చాలా గొప్ప హృదయంతో ప్రజలకు రకరకాల సేవలు అందించారు.
అత్యవసర పరిస్థితుల్లో జనాలకు నిత్యావసర వస్తువులను భారీ ఎత్తున పంపిణీ చేశారు. మన దేశంలో అత్యంత ప్రాధాన్యత కలిగిన GJC, GJIIF అవార్డులను కపలవాయి విజయ కుమార్ అందుకోవడంపై ఏ.పి. బులియన్ కార్యవర్గ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.