28.2 C
Hyderabad
April 20, 2024 12: 06 PM
Slider చిత్తూరు

శ్రీ కపిలేశ్వరాలయంలో వేడుక‌గా ప‌విత్ర స‌మ‌ర్ప‌ణ‌

#LordBalaji

తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో జ‌రుగుతున్న పవిత్రోత్సవాల్లో రెండో రోజైన సోమ‌వారం వేడుక‌గా గ్రంథి ప‌విత్ర స‌మ‌ర్ప‌ణ జ‌రిగింది. ఇందులో భాగంగా ఉద‌యం 8 నుండి 11 గంట‌ల వ‌ర‌కు యాగ‌శాల పూజ‌, హోమం, ల‌ఘు పూర్ణాహుతి, గ్రంథి ప‌విత్ర స‌మ‌ర్ప‌ణ చేప‌ట్టారు. ‌

సాయంత్రం 6 నుండి రాత్రి 8.30 గంటల వరకు యాగ‌శాల‌పూజ‌, హోమం, ప‌ట్టు ప‌విత్ర ప్ర‌తిష్ఠ కార్యక్రమాలు నిర్వ‌హిస్తారు. ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో తెలియక కొన్ని దోషాలు జరుగుతుంటాయి. వీటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా శైవాగమశాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. ఈ కార్య‌క్ర‌మంలో ఆల‌య డెప్యూటీ ఈవో దేవేంద్ర‌బాబు, ఏఈఓ శ్రీ‌నివాసులు, సూప‌రింటెండెంట్ భూప‌తి, టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్లు రెడ్డిశేఖ‌ర్‌, శ్రీనివాస నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

డీఆర్ఓ స‌హ‌కారం లేనిదే క‌లెక్ట‌ర్ ముందు కెళ్ల‌లేరా..?

Satyam NEWS

మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభించిన  జిల్లా కలెక్టర్

Satyam NEWS

రిబ్బన్ కట్:పోలీస్ స్టేషన్ ను ప్రారంభించిన కలెక్టర్ ఎస్పీ

Satyam NEWS

Leave a Comment