చిత్తూరు జిల్లా తిరుపతి నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ చార్జిగా కె. కిరణ్ రాయల్ ను జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ నియమించడం పై కాపు జాగృతి హైదరాబాద్ కన్వీనర్ కె లలిత్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. రాజకీయాలలో పెను మార్పు తీసుకువచ్చే దిశగా పని చేస్తున్న పవన్ కల్యాణ్ యువకుడు ఉత్సాహవంతుడు అయిన కిరణ్ ను సముచిత స్థానంలో నియమించారని లలిత్ అన్నారు.
ఇలాంటి నాయకులకు అవకాశం ఇవ్వడం ద్వారా జన సేన రాజకీయాలు కొత్త ఒరవడిలో ఉంటాయని మరొక్క మారు నిరూపణ అయిందని లలిత్ కుమార్ అన్నారు. రాబోయే రోజుల్లో ప్రజా క్షేత్రంలో మరింత చక్కగా పని చేసి ప్రజల హృదయాలను గెలుచుకుని మరిన్న ఉన్నత శిఖరాలకు కిరణ్ చేరాలని లలిత్ కుమార్ ఆకాంక్షించారు.