కాపు రిజర్వేషన్ల ఉద్యమానికి సంబంధించిన కేసులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉపసంహరించుకుంది. తుని రైలు దగ్ధం ఘటన లో మరో 17 కేసులల్లోనూ విచారణను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రభుత్వ ఉత్తర్వులు వెలువరించింది.
తుని రూరల్ పోలీస్ స్టేషన్ లో నమోదు అయిన 17 కేసులను ఉపసంహరిస్తున్నట్టు హోమ్ శాఖ కార్యదర్శి కుమార్ విశ్వజిత్ ఉత్తర్వులు విడుదల చేశారు.
డీజీపీ సిఫార్సుల మేరకు ఈ కేసులను ఉపసంహరిస్తున్నట్టు హోమ్ శాఖ తెలిపింది. నమోదైన 69 కేసులకు గాను ఇప్పటికే 51 కేసులను గత ఏడాది ప్రభుత్వం ఉపసంహరించుకున్నది.